కొడుకు క్షేమం కోసం కాజల్ ముందు చూపు… కొడుకుపై ఇంత ప్రేమ?

అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. అందం అభిప్రాయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న కాజల్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ వంటి పలు భాషలలో అగ్ర హీరోల సరసన నటించి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లని వివాహం చేసుకుంది. అయితే వివాహం అయిన తర్వాత కూడ కాజల్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలో నటించింది.

ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వత కాజల్ తన అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది. తను తల్లీ కాబోతున్న విషయాన్ని సోషియల్ మీడియా ద్వార షేర్ చేసింది. అప్పటి నుండి కాజల్ సినిమాలకి దూరంగా ఉంటూ ప్రెగ్నెన్సీ సమయంలో తాను ఎదుర్కున్న అనుభూతుల గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునేది. ఇటీవల కాజల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. కాజల్ అగర్వాల్ తన కొడుకు గురించి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తల్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ తన కొడుకు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా పాటిస్తుంది. అందుకు నిదర్శనం ఇప్పుడు మనం చర్చించుకోబోయే విషయం.

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అందువల్ల తన కొడుకు క్షేమం కోసం కాజల్ అగర్వాల్ కుటుంబ సభ్యులను కూడా ఇంటికి రానివ్వకుండా వారితో మాట్లాడటానికి టెక్నాలజీ వాడుకుంటుంది. కరోనా విజృంభించిన సమయంలో ప్రజలు ఒకరితో ఒకరు కలవకుండా సామాజిక దూరం పాటిస్తూ ఉండేవారు. అందరూ వీడియో కాల్స్, జూమ్ మీటింగ్స్ అంటూ వర్చువల్‌గా చూసుకున్నారు. మళ్లీ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కాజల్అగర్వాల్ తన కొడుకు క్షేమం కోసం ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులను ఎవరిని ఇంటికి రానీయకుండా ఫ్యామిలీతో జూమ్ వీడియో కాల్ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తోంది. ఈ విషయాన్ని కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది .