హేమ కొరికింది.. విక్టరీ ‘మంచు’ వశమైంది.!

 

పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ కాలికి దెబ్బ తగిలింది. ఆమె ఘనవిజయం సాధించింది. 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ మీద కోడి కత్తి దాడి జరిగింది. వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే, ప్రకాష్ రాజ్ ప్యానల్‌కి చెందిన హేమ, మంచు విష్ణు ప్యానెల్ సభ్యుడైన శివబాలాజీ చెయ్యి కొరికింది.. ఆయన ఆసుపత్రికి వెళ్ళాడు.. మంచు విష్ణు ప్యానెల్ విజయాన్ని అందుకుంది.

రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.. అని అనుకోవడానికి వీల్లేదు. సినిమాల్లోనూ రాజకీయం వర్కవుట్ అయ్యిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? హేమ ఎందుకు కొరికింది.? ఇది మంచు విష్ణు ప్యానెల్ ఆడించిన డ్రామానా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయ్ ఇప్పుడందరికీ.

ఆసుపత్రికి.. అందునా నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి శివబాలాజీ చికిత్స చేయించుకున్నాడు. శివబాలాజీ అంటే పవన్ కళ్యాణ్ అభిమాని అనే పేరుండేది ఒకప్పుడు. సో, అక్కడ కొట్టారన్నమాట. హేమ కొరకడంపై మంచు విష్ణు ప్యానెల్ రథ సారధి నరేష్ చేసిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు.

ఈ విషయమై సినీ పరిశ్రమలో పెద్ద చర్చే జరిగింది. ఓటర్లు వున్నపళంగా, చివరి నిమిషంలో విష్ణు వైపు ఈ ఘటనతో తిరిగారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమేనా.? నిజమే అయి వుండొచ్చు కూడా.