Hema: భోజనానికి కూర్చున్న నన్ను అందరి ముందు అవమానించాడు.. నటి హేమ షాకింగ్ కామెంట్స్!

Hema: ముత్యాల సుబ్బయ్య గారి సినిమా భారతనారి అనే సినిమా చేస్తున్నపుడు తనకు ఎదురైన ఒక సంఘటనను గురించి నటి హేమ ఈ విధంగా వివరించారు. జైరాం అనే అతను ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేవాడని, అతను అందరికీ ఫుడ్ పెట్టేవాడని ఆమె చెప్పారు. అయితే బ్రేక్ సమయంలో డైరెక్టర్‌తో సహా అందరూ భోజనం చేస్తున్నపుడు జరిగిన సన్నివేషాన్ని ఆమె ఇలా చెప్పుకొచ్చారు.

అలా అందరూ కలిసి భోజనం చేస్తున్నపుడు, జైరాం అనే వ్యక్తి వచ్చి, ఇక్కడి నుంచి లే, అక్కడ పెట్టారు కదా అక్కడికెళ్లు తిను అని అందరి ముందూ తన మీద గట్టిగా అరిచేశాడని ఆమె చెప్పారు. తాను చిన్నప్పటినుంచి ఎంతో మందికి తాను భోజనం పెట్టానని, ఊహ తెలియని సమయంలోనూ తన చేతుల్తో ఎంతో మందికి అన్నం పెట్టానని ఆమె తెలిపారు. ఎవరైనా అడుక్కునే వారు వస్తే కూడా వాళ్లను నించోబెట్టి లోపలికెళ్లి డబ్బులు తీసుకొచ్చే టైప్ తాను అని ఆమె చెప్పారు. అది పావలానా, అర్థ రూపాయా అని కాదు, తన వయసుకు తనకు అనిపించింది తాను చేసేదాన్ని అని ఆమె తెలిపారు. అంతే కాదు ఉన్నోళ్లమా, లేనోళ్లమా అని పక్కన పెడితే ఊర్లోకి వెళితే ఒక మర్యాద ఉంటుందని ఆమె చెప్పుకొచ్చారు.

అలాంటి తనను ఆ ప్రొడక్షన్ చీఫ్ అలా అనేసరికి తనకు చాలా కోపం వచ్చిందని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. టేబుల్ లేపి విసిరికొట్టి, అతన్ని కొట్టడానికి అన్నట్టు కుర్చీ తీసి విసిరివేశానని ఆమె చెప్పారు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు, అన్నం దగ్గర కూర్చున్న అమ్మాయితో ఇలా మాట్లాడుతావా అని అతనిపై కోప్పడినట్టు ఆమె వివరించారు. ఆ సమయంలో తాను చాలా బాధపడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తాను ఈ విషయాన్ని ఎక్కడా పంచుకోలేదని ఆమె చెప్పారు. ఇకపోతే ఆ జైరాం అనే వ్యక్తి ఇప్పుడు కూడా ఉన్నాడని, తర్వాత తాను పెద్ద ఆర్టిస్ట్ అయినపుడు అతను ప్రొడక్షన్ చేశాడని, అతను ఇప్పుడంటాడు.. అమ్మా నేను ఎవరి మీద విసుక్కున్నా ఇలా టాప్ మోస్ట్ అయిపోయావమ్మా అని అంటాడని ఆమె అన్నారు. కానీ ఆ విషయం మాత్రం మనసులో అలా ఉండిపోయిందని ఆమె తెలిపారు. అదే వ్యక్తి తాను నరసింహానాయుడు సినిమా చేస్తున్నపుడు క్యారేజ్ పెట్టి, ముంత పెరుగు, ఏముంటే అవి అన్నీ తెచ్చి తన టేబుల్‌పై పెట్టేవాడని ఆమె వివరించారు.