అహంకారంగా అజ్ఞానంతో మాట్లాడి వేధించాడు:పూజా హెగ్డే

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం పూజా తులసి సినిమా అవకాశాలు తో దూసుకుపోతోంది. అంతేకాకుండా పూజా హెగ్డే హీరోలకు, దర్శక నిర్మాతలకు లక్కీ హీరోయిన్ గా కూడా మారిపోయింది. బాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవలే పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, అలాగే బీస్ట్ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరికొన్ని ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే పూజా హెగ్డేకు ఒక చేదు అనుభవం ఎదురయింది.

తాజాగా గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో ఇండిగో సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయింది. విపుల్‌ నకాషే అనే ఉద్యోగి తనతో అహంకారంగా, అజ్ఞానంతో మాట్లాడాడని, ఎలాంటి కారణాలు లేకుండానే వేధించాడని చెప్పుకొచ్చింది. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ట్వీట్‌ చేయనని కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో చాలా భయమేసిందని పేర్కొంది పూజా హెగ్డే. దీనిపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ సదరు హీరోయిన్‌కు క్షమాపణలు తెలిపింది.

ఇలాంటి అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ఈ విషయం తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఇండిగో యాజమాన్యం. ఇకపోతే పూజా విషయానికి వస్తే ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో పూజాహెగ్డే సినిమాల విషయంలో అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. ఆమె నటించిన మూడు సినిమాలు ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద పరాజయం పాలవడంతో ఆమె తీవ్ర నిరాశ చెందినట్లు తెలుస్తోంది.