అక్బరుద్దీన్‌కు భారీ ఊరట

Akbaruddin Owaisi questioned KCR

అక్బరుద్దీన్‌పై నమోదు అయిన  కేసులను కోర్టు కొట్టివేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.  అక్బరుద్దీన్‌ ఒవైసీ వివాదాస్పద వాఖ్యల కేసులో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఈ  తీర్పును వెల్లడించింది. నిర్మల్‌లో మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్య లు చేశారంటూ అక్బరుద్దీన్‌ ఒవైసీపై నమోదైంది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. తాజాగా ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు… కేసులను కొట్టేస్తూ అక్బరుద్దీన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని కోర్టు వ్యాఖ్యానించింది.