హనుమకొండ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు మృతి

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.  ప్రమాద సమయంలో బొలేరోలో మొత్తం 25 మంది కూలీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.