Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌..

gold

22 క్యారట్ తులం బంగారం ధర రూ.200 పెరిగి.. రూ.48,400కి ఉండగా.. 24 క్యారట్ల బంగారం రూ.220 పెరిగి రూ.52,800 చేరింది. వెండి రేటు కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి రూ.747గా ఉంది. నిన్నటితో పోల్చితే తులంపై రూ.1 పెరిగింది. కేజీ వెండి రూ.74,700కి ఉంది. రెండు రోజులుగా కాస్త తగ్గిన బంగారం ధర ఆదివారం మరోసారి పెరిగింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది.