Road Accident: రాఘవేంద్రుడి దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు…రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి!

Road Accident: బెంగుళూరుకు చెందిన యశోదమ్మా అక్కలు శారదా, చంద్రమ్మ బావ రామాంజినప్పతో కలిసి బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో మంత్రాలయం బయలుదేరి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున 3:30 సమయంలో కారు కల్వర్ట్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కల్లుదేవరకుంట గ్రామ సమీపంలో కారు ప్రమాదానికి గురైంది. మంత్రాలయం మరీ కాసేపటిలో చేరేలోపే ప్రమాదం సంభవించింది.
ఘటనలో శారదా (53) తీవ్రంగా గాయపడిన హాస్పిటల్ కు తీసుకెళ్లేలోపు మరణించారు.

కారులో ప్రయాణిస్తున్న చంద్రమ్మ,రామాంజినప్ప, యశోదమ్మ, డ్రైవర్ రఘుమేష్ కారు ఎయిర్ బాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు
మృతి చెందిన శారదా కారు వెనుక సీట్ లో కూర్చొన్నారు, ప్రమాద సమయంలో కారు డోర్ తలకు బలంగా తగలడంతో మరణించారాని సమాచారం.
సమాచారమందుకున్న వెంటనే స్థానిక ఎస్సై వేణుగోపాల్ రాజు ఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కున శారదను బయటికి తీయించి అంబులెన్సు లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారని తెలుస్తుంది.

మిగిలిన వారిని 108వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కర్నూల్ కు తరలించారు. శారదా మృతదేహనికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించామని తెలిపారు.
అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.