AP: అన్నింటికి తెగించే వస్తున్నాం… దమ్ముంటే కాచుకోండి… వైసీపీలో యాక్టివ్ అయిన అనిల్!

AP: నెల్లూరు జిల్లా వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరిగి రాజకీయాలలో ఫుల్ ఆక్టివ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సవాల్ విసురుతూ చేసినటువంటి కామెంట్లు సంచలనంగా మారాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గత ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో పూర్తిగా సైలెంట్ అయ్యారు.

పార్టీకి సంబంధించిన కార్యకలాపాలకు ఈయన దూరంగా ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ సైతం వైసీపీకి దూరం కాబోతున్నారని అందుకే మౌనంగా ఉంటున్నారంటూ వార్తలు వినిపించాయి అయితే తాజాగా అనిల్ కుమార్ యాదవ్ ఈ వార్తలన్నింటిని కూడా ఖండించారు కేవలం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజకీయాలకు మీడియాకు దూరంగా ఉన్నానని ఇకపై పూర్తి రాజకీయ కార్యకలాపాలలోనే నిమగ్నం అవుతానని తెలిపారు. అన్నింటికీ తెగించి సవాలను ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని, సైదాపురంలో మూసివేసిన గనులను ఐదు రోజుల్లో తెరవకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.గత వైసీపీ ప్రభుత్వం కొన్ని గనులపై 255 కోట్ల రూపాయల జరిమానాలు విధించిందని, ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఉందని ఈయన గుర్తు చేశారు.

పెనాల్టీ ఉన్న గనులను తిరిగి తెరిచి అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో వందల గనులు ఉన్నప్పటికీ, కేవలం 30 గనులను మాత్రమే ఎందుకు తిరిగి ప్రారంభించారు అంటూ అనిల్ కుమార్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా తనపై అక్రమంగా కేసులు పెట్టబోతున్నారని ఇలా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదనీ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే పూర్తిస్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టడమే కాకుండా పూర్తిగా యాక్టివ్ అయ్యారని తెలుస్తుంది.