షణ్ముఖ్ ని టార్గెట్ చేసిన మాజీ ప్రేయసి దీప్తి .. వైరల్ అవుతున్న వీడియో..!

యూట్యూబర్ గా ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5 లో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. బిగ్ బాస్ ద్వారా షణ్ముఖ్ మరింత పాపులర్ అయ్యాడు. షణ్ముఖ్ జస్వంత్ ప్రేయసి దీప్తి సునైనా కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. యూట్యూబ్ వీడియోస్, ఇన్ స్టా రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన దీప్తి సునైనా సోషల్ మీడియాలో కదా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ నేటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు. దీప్తి కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొని మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే కొంత కాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ సిరిహన్మంత్ తో హద్దులు దాటి చాలా క్లోజ్ గా మూవ్ అవ్వటం వల్ల ఐదు సంవత్సరాల వీరి రిలేషన్ షిప్ కి బ్రేక్ పడింది. షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతనికి సపోర్ట్ చేసిన దీప్తి సునయన షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది. ఇలా వీరిద్దరూ విడిపోయి ప్రస్తుతం వారి పనులలో బిజీగా ఉంటున్నారు.

అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇటీవల విడుదలైన విరాటపర్వం సినిమాలోని ఒక సీన్ ని పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సాయి పల్లవి,వీరశంకర్‌ మద్య ఉన్న ఉన్న సన్నివేశం ఉంది. ఈ సన్నివేశంలో వీర శంకర్ ‘ఇక్కడ ఎవరిని ఎవరు ప్రేమించరని, మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజం.ఇంకా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక పెద్ద అబద్దం’ అని సాయి పల్లవికి చెబుతాడు. అయితే ఈ పోస్ట్ చూసిన నేటిజన్స్ దీప్తి కావాలనే షణ్ముఖ్ ని టార్గెట్ చేసి ఈ వీడియో పోస్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.