ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికయ్యాను: కె. లక్ష్మణ్

తాజాగా బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే.. లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇక ఈ విషయాన్ని లక్ష్మణ్ కూడా తన ట్విట్టర్లో తెలిపారు. తను ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి పార్లమెంట్ సభ్యునిగా రాజ్యసభకు ఎన్నికయ్యాను అంటూ ట్వీట్ చేశారు. యూపీ కోట నుంచి బీజేపీ ఆయనను రాజ్యసభ బరిలో నిలుపగ.. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.