AP: ఏపీ రాష్ట్ర రాజకీయాలు వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు అనడంలో అతిశయోక్తి లేదు. ఒక కుటుంబంలో ఒకరు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత వారి అనంతరం తన కుటుంబ సభ్యులే రాజకీయాలలో కొనసాగాలని భావిస్తూ ఉంటారు అలా కొన్ని కుటుంబాలు రాజకీయాలలో కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎన్నికలలో పోటీ చేసి గెలిచేది ఒకరైతే పెత్తనం చెలాయించేది మరొకరు అన్న ధోరణిలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు ఉందని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా మంత్రిగా పనిచేసినటువంటి వారిలో యనమల రామకృష్ణుడు ఒకరు అయితే ఈసారి ఎన్నికలలో ఆయన కుమార్తె దివ్యకు సీటు ఇవ్వడం ఆమె విజయం సాధించడం జరిగింది. ఈమెకుటుంబం మొత్తం రాజకీయాలలో కొనసాగుతున్నారు అయితే దివ్య విజయం సాధించిన తర్వాత ఈమె కంటే కూడా తన భర్తకి అధిక ప్రాధాన్యత ఉంది.
ఏదైనా పని జరగాలంటే ఎమ్మెల్యే తో కాకుండా ఆమె భర్తతో మాట్లాడితే చాలు పని అయిపోతుంది. అయితే కార్యకర్తలకు పార్టీకి మంచి పేరు తీసుకువస్తూ మంచి పని చేస్తే పర్వాలేదు కానీ లేదు కానీ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలాగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని పలువురు కార్యకర్తలు భావిస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా ఇదే తరహా పాలన కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక్కడ పల్లె సింధూర రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు కానీ తన మామయ్య మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
పేరుకే తన కోడలు సింధూర రెడ్డి ఎమ్మెల్యే కానీ ఇచ్చిపుచ్చుకోవడం ఇతర వ్యవహారాలన్నీ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా తన మామయ్య రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్యే భర్త చూసుకుంటున్నారని తెలుస్తోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నెలవల సుబ్రహ్మణ్యం టీడీపీ కి సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అయితే.. గత ఏడాది ఎన్నికల్లో ఆయనను తప్పించిన చంద్రబాబు.. సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీకి అవకాశం ఇచ్చారు. ఆమె విజయం సాధించింది కానీ పేరుకే ఆమె ఎమ్మెల్యే పెత్తనం మొత్తం తన ఇద్దరి సోదరులదని చెప్పాలి. వీరిద్దరూ ఆ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు. ఇలా గెలిచింది ఒకరైతే పెత్తనం మరొకరిదిగా కొనసాగుతుంది ఇలాగే జరిగితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పాలి.