Madhuri: ఆస్తులన్నీ నావే…. దువ్వాడకు సంబంధం లేదు….బాంబ్ పేల్చిన దివ్వెల మాధురి?

Madhuri: దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ పరిచయం అవసరం లేని పేరు. లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవల కాలంలో వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సంచలన విషయాలను బయటపెట్టారు. దువ్వాడ శ్రీనివాస టెక్కలి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందారు అయితే ఇటీవల వైసిపి పార్టీ ఈయనని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సమయంలోనే తన భార్య వాణిను దూరం పెట్టి మాధురి అనే మహిళ వద్ద ఉంటూ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా మాధురి శ్రీనివాస్ ఒకే చోట ఉండడంతో శ్రీనివాస్ భార్య వాణి అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాన్ని రేకెత్తించారు. ఇలా ఈ వివాదం తర్వాత మాధురి శ్రీనివాస్ ఇద్దరు ఒకే చోట ఉండడం కలిసి ఇంటర్వ్యూలకు పాల్గొనడం వంటివి జరుగుతూ ఉన్నాయి.

మాధురి సరికొత్త బిజినెస్ ని కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ కూడా శ్రీనివాస్ డబ్బులతోనే ఈమె చేస్తున్నారని అందరూ భావించారు కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాధురి తన ఆస్తుల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ తన తండ్రి ఒక రియల్ ఎస్టేట్ అని తెలిపారు. చిన్నప్పటి నుంచి కూడా డబ్బుకు మాకు కొదువ లేదు నేను పుట్టుకతోనే గోల్డెన్ స్కూల్ తో పుట్టానని ఒకరి వద్ద సహాయం కోరాల్సిన కర్మ నాకు పట్టలేదని తెలిపారు.

ఇకపోతే నేను అనుభవిస్తున్న ఈ ఆస్తులన్నీ కూడా నావేనని ఇందులో శ్రీనివాస్ కి ఏమాత్రం సంబంధం లేదని ఆయన తన సంపాదించిన ఆస్తులన్నీ కూడా తన భార్య వాణి పేరు మీదనా రాశారు అంటూ మాధురి తెలియజేశారు .ఇక తన ఆస్తులు చిట్టాన్ని కూడా ఈమె తెలియజేస్తూ… తనకు టెక్కలితో పాటు శ్రీకాకుళంలో కూడా కోట్ల విలువ చేస్తే బంగ్లాలు ఉన్నాయని తెలిపారు. అలాగే టెక్కలిలో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉందని తెలిపారు. అలాగే కోట్ల విలువ చేసే ఖరీదైన కార్లు కూడా ఉన్నాయని ఈమె వెల్లడించారు.ఇలా ఈ ఆస్తులన్నీ కూడా స్వయంగా నేను సంపాదించినవి, ఈ ఆస్తులలో శ్రీనివాస్ కి సంబంధం లేదని మాధురి వెల్లడించారు. ఇలా ఈమె ఆస్తులు చిట్టా విప్పడంతో ఒకసారిగా అందరూ షాక్ అవుతున్నారు.