Divvela Madhuri: ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ తెలుగు 9 రియాలిటి షో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఈసారి షో ఉత్కంఠగా సాగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్ లో ట్విస్ట్ లు మామూలుగా లేవు. ఏ సమయంలో ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. కొత్త మలుపులు, నామినేషన్లు, ఎలిమినేషన్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఎంటర్టైన్మెంట్ డోస్ ను మరింత పెంచేలా నిర్వాహాకులు ప్లాన్ చేశారట.
ఈ సారి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ తో ఏకంగా ఏడుగురు సభ్యులు అడుగు పెట్టనున్నారు. కొత్త సభ్యుల గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ ను బిగ్ బాస్ 2.O గ్రాండ్ లాంచ్ పేరుతో ప్రసారం చేయనున్నారట. అయితే ఈ కొత్త ఎంట్రీలతో బిగ్ బాస్ 9కి కొత్త ఊపు రావడమే కాకుండా ఇంట్లో అసలైన రణరంగం మొదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకుంటే ఈ కొత్త, పాత కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ, కాంట్రవర్సీలు మొదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టనున్న వారిలో మోస్ట్ కాంట్రవర్సీ అయిన వ్యక్తులు దివ్వెల మాధురి నుంచి చిట్టి అలేఖ్య పికిల్స్ రమ్య మోక్ష వరకు ఉన్నారు.
సోషల్ మీడియాలో సెన్సేషన్ దివ్వెల మాధురి బిగ్ బాస్ తెలుగు 9లోకి అడుగుపెడుతోంది. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట ఏపీలో తెగ వైరల్ అయింది. కాగా బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభంలోనే వెళ్లాల్సిన దివ్వెల మాధురి ఇప్పుడు ఎంట్రీ ఇవ్వనుందట. దివ్వెల మాధురి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో పెద్ద రచ్చకు దారి తీసింది. ఆమె చేసే పోస్టులు అమాంతం వైరల్ అయ్యాయి. ఇలాంటి సెన్సేషనల్ ఇమేజ్ ఉన్న మాధురి హౌస్లోకి వస్తే డ్రామా పీక్స్కు వెళ్లడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Divvela Madhuri: దివ్వెల మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోందా?
