Mahesh Kumar Gowd: కేటీఆర్ అండతో డ్రగ్స్ మాఫియా చెలరేగుతుంది: మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Gowd: తాజాగా బంజారాహిల్స్ లో రాడిసన్ బ్లూ హోటల్ లో పుడింగ్ మింక్ పబ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. దీంతో పోలీసులకు అనుమానం రావడంతో ఆ పబ్ పై దాడి చేశారు. ఇందులో పలువురు సెలబ్రెటీలతో పాటు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం గురించి బాగా చర్చలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ పై తెగ ఫైర్ అయ్యాడు.

కేటీఆర్ అండతో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుందని.. హైదరాబాద్ పబ్బుల్లో ఆయనకు మద్దతు ఉందని.. అందుకే అర్ధరాత్రి దాటినా కూడా పబ్బు తెరిచి ఉందని అన్నాడు. అంతేకాకుండా ఆయన తరచుగా గోవా వెళ్లడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని.. డ్రగ్స్ అలవాటు లేకపోతే శాంపిల్ ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించాడు.