రీ ఎంట్రీ ఇవ్వనున్న వంటలక్క డాక్టర్ బాబు… రేటింగ్ అదిరిపోవాలంతే!

బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్ చాలామంది వంటలక్క కోసమే చూసే వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప , కార్తీక్ పాత్రలలో నటించిన ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ లకు రెండు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.ఇకపోతే ఈ సీరియల్లో వీరిద్దరూ ఉన్నంతవరకు ఈ సీరియల్ రేటింగ్స్ అమాంతం పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ సీరియల్ ఒక సన్నివేశంలో కార్తీకదీపం ప్రమాదంలో చనిపోయినట్లు చూపించి ఈ సీరియల్ నుంచి వీరిని తొలగించారు. ఇక ఈ సీరియల్లో కార్తీక్, దీప లేకపోవడంతో సీరియల్ చూడటానికి కూడా చాలామంది ఇష్టపడటం లేదు. ఇక ప్రస్తుతం హిమా, సౌర్య కూడా పెద్దవాళ్ళు కావడంతో వీళ్ళ లవ్ స్టోరీతో నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నప్పుడు తప్పిపోయిన సౌర్య గురించి వెతకడం కథలో కీలకంగా పెట్టారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కార్తీకదీపం సీరియల్ లోకి తిరిగి వంటలక్క డాక్టర్ బాబు రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది.

వీరిద్దరూ లోయలోకి పడినప్పుడు చనిపోలేదని ఆ ప్రమాదం నుంచి బయటపడినప్పటికీ వీరి మానసిక స్థితి కోల్పోవడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే దీప సేవలో కార్తీక్ ఉంటూ పూర్తిగా వీరి సొంత ఇంటిని మర్చిపోయి ఉంటారు. అదే సమయంలోనే జ్వాల దగ్గర ఉన్నటువంటి చంద్రమ్మ ఇంద్రుడు పని నిమిత్తం చిక్ మంగళూరు వెళ్తారు. ఆ క్షణం కార్తీక్ దీపం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది. వీరి సహాయంతో దీప కార్తీక్ తిరిగి వీరి ఇంటికి చేరుకుంటారు. ఈ క్రమంలోనే మోనిత కూడా రీ ఎంట్రీ ఇస్తుందనే సమాచారం పెద్దఎత్తున వినపడుతుంది.ఇదే కనుక నిజమైతే ఈ సీరియల్ రేటింగ్ అమాంతం పెరిగి పోతాయనడంలో ఏమాత్రం సందేహం వ్యక్తం చేయాల్సిన పనిలేదు.