వింత వ్యాధితో బాధపడుతున్న డాక్టర్ బాబు భార్య మంజుల?

బుల్లితెర నటులు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద ప్రసారమైన చంద్రముఖి, కలవారి కోడళ్లు, కార్తీకదీపం హిట్లర్ గారి పెళ్ళాం వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నిరుపమ్ పరిటాల నటించాడు. నిరుపమ్ అనే పేరు కన్నా డాక్టర్ బాబు అంటేనే చాలామంది గుర్తుపడతారు. కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు నిరుపమ్ ప్రస్తుతం ఆ సీరియల్ లో నటించడం లేదు. సీరియల్ కథ మొత్తం మారిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళు అవటం వల్ల ఆ సీరియల్ లో చాలా మంది కొత్త ఆర్టిస్టులు నటిస్తున్నారు.

ప్రస్తుతం నిరుపం తన భార్య తో కలిసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. మంజుల నిరుపమ్ అని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ ఛానల్ ద్వార నిత్యం వారి లైఫ్ లో జరిగే విషయాల గురించి వారి అభిమానులకు తెలియచేస్తున్నారు. ఇటీవల వారి అభిమానులకి అదిరిపోయే ఆఫర్ కూడా ఇచ్చారు. వారి అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చేప్తు ఒక వీడియో చేశారు . ఆ వీడియోలో సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో కార్తీకదీపం సీరియల్ లో రీఎంట్రీ గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకి నిరుపమ్ పరిటాల స్పందిస్తూ సమాధానం చెప్పాడు. అంతే కాకుండా మంజుల వ్యాది గురించి కూడా ఈ సందర్భంగా అభిమానులకి క్లారిటీ ఇచ్చింది.

కొంతకాలం క్రితం మంజుల వైరల్ ఆర్థరైటిస్ వ్యాధితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ టీవీలో ప్రసారమైన ఒక షోలో పాల్గొన్న మంజుల ఈ వ్యాధి గురించి బయట పెట్టింది. ఆ సమయంలో ఈమెకి వచ్చిన వ్యాధి గురించి చాలా వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మంజుల తనకి వచ్చిన వ్యాధి గురించి నెటిజన్స్ కి పూర్తి వివరణ ఇచ్చింది. ఆర్థరైటిస్ వ్యాధి ఎలా తగ్గింది? దాని ట్రీట్మెంట్ గురించి అడిగిన ప్రశ్నలకు మంజుల సమాధానం చెబుతూ.. ఆర్థరైటిస్ వ్యాధికి ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. అది దానంతట అదే వచ్చి తగ్గిపోతుంది. ఈ వ్యాధి వచ్చిన నాలుగైదు వారాలు కూడా తగ్గకపోతే అప్పుడు డాక్టర్ ని సంప్రదించాల్సి వస్తుంది. కానీ కొన్ని రోజులు ఈ వ్యాధితో నేను చాలా నరకం అనుభవించాను. యశోద హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోయింది…అంటూ చెప్పుకొచ్చింది.