ఒక రోజు కాల్షీట్ కోసం శ్రీముఖి తీసుకునే రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర యాంకర్ గా ఎంతోమంది కొనసాగుతూ తమ అద్భుతమైన వాక్చాతుర్యంతో విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే తెలుగు బుల్లితెరపై సుమ శ్యామల అనసూయ రష్మీ వంటివారు యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే వీరితో పాటు శ్రీముఖి కూడా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నారు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించి సందడి చేసిన శ్రీముఖి అనంతరం పటాస్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా ఈ కార్యక్రమంతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న ఈమెకు ఏకంగా బుల్లితెర రాములమ్మ పేరు పెట్టారు. వరుస కార్యక్రమాలతో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పర్చుకున్న శ్రీముఖి అనంతరం బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఈమె చివరి వరకు ఎంతో పోరాడి చివరికి రన్నరప్గా నిలిచారు. బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు పొందిన శ్రీముఖి ప్రస్తుతం వరుస కార్యక్రమాలు, అదేవిధంగా సినిమాలు, ప్రత్యేకం ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక ఈమె ఎంతో అద్భుతంగా యాంకరింగ్ చేయడమే కాకుండా తన అల్లరి చేష్టలతో ఆ వాతావరణం మొత్తం ఎంతో సందడిగా ఉండేలా చూస్తారు. ఇలా బుల్లితెర ప్రేక్షకులను తన దైన శైలిలో సందడి చేస్తున్న శ్రీముఖి ఒకరోజు కాల్షీట్ కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈమె ఒక రోజుకు ఏకంగా మూడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సుమ తర్వాత ఎంతో మంది సీనియర్ యాంకర్స్ ఉన్నప్పటికీ శ్రీముఖి ఇలా రోజుకు 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.