Corona Virus: కరోనా సోకినప్పుడు వచ్చే గొంతు నొప్పికి, సాధారణ గొంతు నొప్పికి గల తేడాలు ఏమిటో తెలుసా?

Corona Virus (Covid 19): Unsolved Myster For Ever?

మాయదారి మహమ్మారి కరోనా వైరస్ ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎంతోమంది పిల్లలు తల్లితండ్రులను కోల్పోయారు. బంధాలు బంధుత్వాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు కరోనా మూడవ వేవ్ ప్రళయం సృష్టిస్తోంది. కరోనా వచ్చిన వారిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం సర్వసాధారణ లక్షణాలు. అయితే ఇవి శీతాకాలంలో, వర్షాకాలంలో వాతావరణ మార్పు వలన వచ్చే సాధారణ వ్యాధులు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గొంతు నొప్పి గురించి. అని గొంతు నొప్పులు కరోనా కాదు. అయితే కరుణ వైరస్ సోకిన వారికి దగ్గు, జలుబు, ఫ్లూ లక్షణాలు కంటే ముందుగా గొంతునొప్పి మొదలవుతుంది అని అధ్యయనాలు తెలిపాయి.

గొంతులో దురద, మంట, వాపు, నొప్పి వంటి లక్షణాలు ఉన్నట్టయితే కరోనా గా అనుమానించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 52 శాతం మందిలో ఈ లక్షణాలను గుర్తించినట్టు చెబుతున్నారు. విపరీతమైన గొంతు నొప్పితో బాధపడేవారు ఒకసారి డాక్టర్ని సంప్రదించడం మంచిది. కరోనా వైరస్ సోకిన వారిలో గొంతు నొప్పి ఏ విధంగా ఉంటుందో ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి.

*మీరు గనుక కరోనా వైరస్ కి ఇన్ఫెక్ట్ అయినట్లయితే గొంతు నొప్పి తో పాటు గొంతువాపు, తీవ్రమైన గొంతు మంట ఉంటాయి.
*చలి, వర్షాలు లేక పోయినా సాధారణ వాతావరణంలో ఉన్నాకూడా గొంతు నొప్పి వచ్చినట్లయితే దానిని కరోనా గా అనుమనించాల్సిన అవసరం ఉంది.
* గతంలో ఎన్నడు జలుబు వచ్చినా కూడా గొంతు నొప్పి బారిన పడనివారు నొప్పితో బాధపడుతుంటే ఒకసారి కోవిడ్-19 టెస్ట్ చేయించుకోవడం మంచిది.
*రద్దీ ప్రాంతంలో తిరిగే వారు, ఎప్పుడు జనావాసలలో తిరిగే వారు గొంతు నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు.

గొంతు నొప్పితో బాధపడేవారు చల్లని నీటిని, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లను అస్సలు తీసుకోకూడదు. ఎక్కువగా వేడి నీటిని తాగితే త్వరిత ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి, జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే బాగా మరిగించిన నీటిలో కాస్త పసుపు వేసి ఆవిరి పట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవే కాకుండా మీ శరీర ఇమ్మ్యూనిటి నీ పెంచే ఆహార పదార్థాలు తినడం వలన ఒక వేళ మీకు కరోనా ఇన్ఫెక్షన్ సోకిన కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు.