Chiranjeevi- Venkatesh: చిరంజీవి హీరోగా అనుకొని వెంకటేష్ తో చేసిన సినిమా ఏంటో తెలుసా?

Chiranjeevi- Venkatesh: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో రీమేక్ చిత్రాల హవా నడుస్తోంది.అయితే ఈ విధంగా రీమేక్ చిత్రాలు ఇప్పుడు కాకుండా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలా రెబల్ స్టార్ కృష్ణంరాజు తెలుగులో నటించిన ప్రాణ స్నేహితులు సినిమా కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని తమిళంలో ‘అణ్ణామలై’ పేరుతో విడుదల చేయడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాని మరీ తెలుగులో రీమేక్ చేయాలని రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ వీవీ సత్యనారాయణ హయ్యెస్ట్‌ ప్రైజ్‌ కోట్‌ చేసి, కొనుగోలు చేశారు.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ హీరోగా తీసుకోవాలని భావించిన అతను హైదరాబాద్ వెళ్లగానే తనతో కలిసి మాట్లాడాలని భావించారు.అదృష్టవశాత్తు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే ఫ్లైట్ లో మెగాస్టార్ చిరంజీవి కంట పడటం వెళ్లి ఈ సినిమా కథను మెగాస్టార్ కి చెప్పడంతో కథ చాలా బాగుంది హైదరాబాద్ వెళ్లగానే ఒకసారి కలవండి డేట్స్ ఇస్తానని చెప్పాడట. ఇలా మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకోవడంతో ఆనందంలో ఉన్న కెవికె సరాసరి సుందరకాండ సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి వెళ్లారు.

ఇక అక్కడికి వెళ్లగానే ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు అనే విషయం వెంకటేష్ కు తెలియడంతో వెంకటేష్ ఆ సినిమాని కూడా మనమే చేద్దాం అని చెప్పగా ఒక్కసారిగా కెవికే సత్యనారాయణ షాక్ కి గురయ్యారు. అప్పటికే అతనితో సుందరాకాండ తీస్తూ మరోసారి అతనితోనే సినిమా చేయాలంటే సంతోషపడాలో లేకపోతే చిరంజీవికి ఈ సినిమా మిస్ చేస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితులలో నిర్మాత చివరికి వెంకటేష్ తోనే ఈ సినిమాని తీయాల్సి వచ్చింది. అలా వెంకటేష్ హీరోగా కొండపల్లి రాజా చిత్రాన్ని తెరకెక్కించారు.