Balakrishana: బాలయ్య భార్య వసుంధర మెట్టింటికి ఎంత కట్నం తెచ్చిందో తెలుసా?

Balakrishana: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు ఎనిమిదిమంది సంతానం అయినప్పటికీ వీరిలో హరికృష్ణ బాలకృష్ణ మాత్రమే ఆయన నట వారసత్వాన్ని పుచ్చుకొని సినిమాలలోకి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక ఎన్టీఆర్ బాలకృష్ణకు మినహా మిగిలిన వారందరికీ పెళ్లిళ్లు చేసి అనంతరం రాజకీయాలలోకి అడుగుపెట్టారు. రాజకీయాలతో ఎంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ను తన భార్య బసవతారకం బాలకృష్ణకు కూడా పెళ్లి చేయాలని ఒత్తిడి చేసింది.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కర్ రావు బాలకృష్ణ పెళ్లి బాధ్యతలను అప్పగించగా..నాదెండ్ల భాస్కర్ రావు తమ సమీప బంధువు అమ్మాయిని బాలకృష్ణకు ఇచ్చి పెళ్లి చేసేలా ఏర్పాటు చేశారు. ఆ అమ్మాయే వసుంధర. ఈమె ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో బాలకృష్ణకు పెళ్లి సమయంలో తన తండ్రి తనకు కేవలం 10 లక్షల కట్నం ఇచ్చి తన కూతురిని బాలకృష్ణకు ఇచ్చి వివాహం చేశారు.

ఈ విధంగా బాలకృష్ణ భార్య వసుంధర తెచ్చిన కట్నంతో హైదరాబాద్లో ఇంటిని నిర్మించారని గతంలో నాదెండ్ల భాస్కర్ ఒక సందర్భంలో వెల్లడించారు. అలా 10 లక్షల కట్నంతో బాలకృష్ణ ఇంట అడుగుపెట్టిన వసుంధర ప్రస్తుతం కొన్ని కోట్లకు అధిపతిగా మారింది. బాలకృష్ణ వసుంధర దంపతులకు బ్రాహ్మణి, తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ ఉన్నారు. కూతుర్లు ఇద్దరు పెళ్లిళ్లు చేసుకొని మంచి బిజినెస్ చేస్తూ ఉండగా కొడుకు మాత్రం ఇంకా చదువుతూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.