బిగ్ బాస్ విన్నర్ ఎన్ని లక్షలు గెలుచుకుంటారు తెలుసా?

బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం ఈ వారంతో ముగియనుంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి విన్నర్ ఎవరు అని పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇకపోతే టైటిల్ రేసులో బిందు మాధవి, అఖిల్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఏడు మంది కంటెస్టెంట్ లు హౌస్ లో ఉండగా వీరిలో ఇద్దరిని శనివారం హౌస్ నుంచి బయటకు పంపించనున్నట్లు సమాచారం.ఇక మిగిలిన ఐదుగురిలో ఆదివారం విన్నర్ ఎవరో ప్రకటిస్తారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేను మే 21 సాయంత్రం 6 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి అతిథులు ఎవరు హాజరు కావడం లేదని తెలుస్తోంది.సాధారణంగా బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి విజేతగా నిలబడితే వారికి 50 లక్షల నగదు బహుమతి అందజేస్తారు. మరి బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లకు ఎంత డబ్బులు ఇవ్వనున్నారు, విజేతలు ఎన్ని లక్షలు గెలుచుకుంటారనే విషయం గురించి చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో గెలుపొందిన వారికి 25 లక్షల రూపాయల నగదు బహుమతితో పాటు, బిగ్ బాస్ ట్రోపీ అందించనున్నారు. మరి బిగ్ బాస్ షో బిగ్ బిందుమాధవి విజేతగా నిలబడి ఈ డబ్బును అందుకుంటారా లేక అఖిల్ అందుకుంటారా అనే విషయం తెలియాలంటే మరో రెండు రోజులు వేచి ఉండాలి.