Anchor – Udayabhanu: ఉదయ భాను భర్తను చూస్తే మీరు అయ్యో పాపం అనాల్సిందే!

Anchor – Udayabhanu: బుల్లితెరపై సీనియర్ యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ లలో ఉదయభాను ఒకరు. ఒకప్పుడు ఈమె పేరు బుల్లితెర స్టార్ మహిళగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుని అందరి కన్నా ఎక్కువ పారితోషికం తీసుకునే యాంకర్ గా నిలిచారు.

కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో జన్మించిన ఉదయభాను నాలుగు సంవత్సరాల వయస్సులోనే తండ్రి మరణించడంతో ఎన్నో కష్టాలను అనుభవించారు. 16 సంవత్సరాల వయసులోనే హృదయాంజలి అనే కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత జానవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం కాను, సాహసం చేయరా డింభకా ఇలాంటి ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలా బుల్లితెరపై యాంకర్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న తర్వాత వెండితెరపై కూడా తలుకుమంది ఉదయభాను. ఈ క్రమంలోనే లీడర్, శ్రావణమాసం, కొండవీటి సింహం వంటి సినిమాల్లో కూడా నటించారు. ఇండస్ట్రీలో వెండితెరపై, బుల్లితెరపై అత్యధిక పారితోషికం తీసుకుంటూ దూసుకుపోతున్న ఉదయభాను ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

అసలు ఈమె కెరీర్ ఇలా కావడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, గతంలో ఉదయభానుకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఈ విషయం గురించి ఎంతో మానసికంగా ఉదయభాను కుంగిపోయిందని సమాచారం. ఈ సమయంలోనే తన పెళ్లి తర్వాత దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత పండంటి కవల ఆడ పిల్లలకు జన్మనివ్వడంతో తన ప్రపంచం పూర్తిగా తన పిల్లలతోనే అని భావించి ఒక తల్లిగా తన పిల్లల బాధ్యతను, వారి సంరక్షణను చూసుకుంటుంది ఉదయభాను. ఈ లోకంలో ఏదీ ఎక్కువ కాదంటూ తన సమయాన్ని కేటాయించాలని భావించారు. అందుకే ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియా వేదికగా పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ వస్తుంది ఉదయభాను. ఇకపోతే తన పిల్లలు పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని తెలిపింది ఉదయభాను.