సీక్వెల్ కి సిద్ధమైన డీజే టిల్లు సినిమా..కానీ ఇందులో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలుసా..?

సిద్దు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన డీజే టిల్లు సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్దు ఈ సినిమాతో స్టార్ గా మారిపోయాడు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలు అతి తక్కువ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద అంతకు మూడు రెట్లు కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో సిద్దు నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు గతంలోనే అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కు రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కొందరు కొత్త వాళ్ళని కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. డిజె టిల్లు ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ గా నేహా శెట్టి నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ సినిమాలో మాత్రం హీరోయిన్ గా మరొక అందాల నటి కనిపించనున్నట్లు సమాచారం. ఈ డీజే టిల్లు సీక్వెల్ లో నేహా శెట్టి అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ అన్వేషణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

డీజే టిల్లు సీక్వెల్ లో హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్రలో వేరొక హీరోయిన్ ని తీసుకువచ్చి ట్విస్ట్ ఇచ్చారు. డీజే టిల్లు మొదటి భాగంలోని కొన్ని పాత్రలు రెండో భాగంలో కూడా కొనసాగుతాయని డైరక్టర్ వెల్లడించాడు. వీటితో పాటుగా మరికొన్ని కొత్త పాత్రలు కూడా డీజే టిల్లు సీక్వెల్ లో వచ్చి చేరుతాయని సమాచారం . ఈ సీక్వెల్ లో హీరోయిన్ పాత్ర మరీ ముఖ్యమైనది. ఈ సినిమా విడుదలై ఇంతకాలం గడిచినా కూడా ఇప్పటికి ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాలోని పాటలే వినిపిస్తుంటాయి. అంతె కాకుండా ఈ సినిమాలోని ‘అట్లుంటది మనతోని’ అనే డైలాగ్ కూడా బాగా ఫేమస్ అయ్యింది. డీజే టిల్లు సీక్వెల్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.