రాజీనామా ట్వీట్ ను తొలగించిన దివ్యవాణి..

తాజాగా సినీ నటి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి తాజాగా తన రాజీనామా ట్వీట్ ను తొలగించారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయం వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని ఆమె తాజాగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

దీంతో వర్ర రవీందర్రెడ్డి అనే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో క్రమశిక్షణ కమిటీ ఆమెను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంటూ పోస్ట్ పెట్టగా.. ఆ మనస్థాపంతో ఆమె రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అది నకిలీ పోస్టు అని పార్టీ వర్గాలు తనకు తెలియజేయడంతో మొత్తానికి రాజీనామా ట్వీట్ ను తొలగించారు.