మహేష్ సినిమాలో “వైఎస్సార్” డైలాగ్ పై బిగ్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Sarkaru vaaru paata : తాజాగా తెలుగు సినిమా దగ్గర “ఆచార్య” తర్వాత రిలీజ్ కి సిద్ధంగా ఉన్న మరో భారీ రిలీజ్ “సర్కారు వారి పాట”. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి మరికొన్ని రోజులు ఉండగా దీనిపై అంచనాలు మరింత పెంచే విధంగా చేసింది ఈ సినిమా మాస్ ట్రైలర్.

అసలు మహేష్ ని ఊహించని లెవెల్లో దర్శకుడు పరశురామ్ పెట్ల ప్రెజెంట్ చెయ్యడంతో మహేష్ అభిమానులు పిచ్చెక్కిపోయారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా ట్రైలర్ లో మహేష్ “నేను విన్నాను నేను ఉన్నాను” అనే డైలాగ్ చెప్పడం ఏదైతే ఉందో దివంగత ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరియు ప్రస్తుత సీఎం వై ఎస్ జగన్ అభిమానులకి ఫుల్ కిక్ ఇచ్చింది.

అయితే అసలు ఈ సినిమాలో ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది? మహేష్ ఎందుకు చెప్పాడు అనేదానిపై దర్శకుడు పరశురామ్ ఒక క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పుడు నుంచో వైఎస్సార్ కి అభిమానిని అని ఆయన ఛరిష్మాని ఇప్పుడు జగన్ గారు తీసుకెళ్తున్నారు అయితే..

ఆయన చెప్పే ఆ “నేను విన్నాను నేను ఉన్నాను” అనే మాట ఇష్టం అని అలాగే ఈ సినిమాలో ఆ డైలాగ్ పెట్టే చిన్న స్కోప్ కూడా రావడంతో మహేష్ గారికి ముందు చెప్పానని ఆయన కూడా ఎలాంటి అడ్డు చెప్పకపోవడంతో డైలాగ్ చేసేసాం అని తెలిపారు. సో ఇలా ఈ డైలాగ్ ఈ చిత్రంలో యాడ్ అయ్యింది.