దిల్ రాజు విషయంలో మేటర్ సీరియస్ అయ్యేలా ఉందే.!

టాలీవుడ్ టాప్ నిర్మాతలలో దిల్ రాజు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను నిర్మాతగా మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక సినిమాలు తాను రిలీజ్ చేసాడు. అయితే ఇప్పుడు దిల్ రాజుకి ఛాలెంజింగ్ వాతావరణం స్టార్ట్ అయ్యింది అని చెప్పాలి.

ఇప్పుడు దిల్ రాజు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తమిళ సినిమా వారసుడు కూడా ఉంది. తమిళ స్టార్ విజయ్ తో ఈ సినిమా చేయగా ఈ సినిమా విషయంలో తెలుగు ఆడియెన్స్ దిల్ రాజు పట్ల ఇప్పుడు నుంచే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమాని తమిళ్ లోనే ఇది ప్రాపర్ తమిళ్ సినిమా అని ప్రాజెక్ట్ చేస్తున్నారు.

మరి అలాంటప్పుడు మన తెలుగులో ఇది డబ్బింగ్ సినిమా కాబట్టి తక్కువ థియేటర్లు మాత్రమే కేటాయించాలి అని దిల్ రాజే ఒకప్పుడు చెప్పాడు. మరి ఇప్పుడు కానీ వారసుడు కి తాను నిర్మిస్తున్న సినిమా అని ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తే బాగోదని ఇతర ఫ్యాన్స్ ముందే చెప్తున్నారు.

ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు వాల్తేరు వీరయ్య అలాగే వీరసింహా రెడ్డి చిత్రాలు ఉన్నాయి. మరి వీటి విషయంలో కౌంట్ ఎమన్నా తేడా వస్తే అప్పుడు దిల్ రాజు సీరియస్ ఇష్యూ పేస్ చెయ్యాల్సి రావచ్చని ఇతర సినీ వర్గాల వారే అంటున్నారు.

మన సినిమాలకి ఇదే సంక్రాంతి లో అసలు తమిళ్ లో అయితే థియేటర్స్ నే దొరకవు అలాంటిది ఓ డబ్బింగ్ సినిమాకి మన దగ్గర ఎందుకు ఇవ్వాలి అనేది మన వాళ్ళ పాయింట్. ఏది ఏమైనప్పటికీ మాత్రం దిల్ రాజు ఏం చేస్తాడో చూడాలి.