Anchor Shyamala: ఆ పార్టీ యాంకర్ శ్యామలను టార్గెట్ చేసిందా…. ఏం జరుగుతుందసలు!

Anchor Shyamala: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది యాంకర్ శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. శ్యామల భర్త నరసింహారెడ్డి 2017 నుంచి విడుదల వారీగా దాదాపుగా కోటి రూపాయల వరకు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వమని అడిగినందుకు బెదిరించడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఒక బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సెటిల్మెంట్ చేసేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళ పై చీటింగ్ కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరి ఆ తరువాత ఈ కేసు ఏమైంది అన్న విషయం గురించి ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇదే విషయంపై శ్యామల స్పందిస్తూ తన భర్త తప్పు చేయడని ఆ మహిళ ఎవరు గొడవ ఏంటి అన్నది మీడియాలో చూసి చివరకు తనకు కూడా తెలియదని తెలిపింది. శ్యామల భర్త నరసింహారెడ్డి కూడా వైసీపీ పార్టీలో ఉండటం అదేవిధంగా జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొనడం పై తీవ్రంగా మండిపడిన టీడీపీ సీఎం జగన్ తో శ్యామల, నరసింహా రెడ్డి కలిసి దిగిన ఫోటో ని షేర్ చేసి నేరగాళ్లకు వైసీపీ కండువా వీరతాడు తొడుగుతారేమో అనుకుంటున్నారు..ఎంతైనా కూడా ఆ పార్టీకి అవినీతి పునాది కదా అంటూ ట్వీట్ చేశారు.

అయితే శ్యామల భర్త విషయం గతంలో పెద్ద ఇష్యూ అయినప్పటికీ తాజాగా టీడీపీ అదే విషయాన్ని మరొకసారి తెరపైకి తీసుకువచ్చి.. అధికార పార్టీ అండ చూసుకుని యాంకర్ శ్యామల భర్త ఒక మహిళను కోటి రూపాయలు మోసం చేయడమే కాకుండా ఆమెను లైంగికంగా కూడా విధించిన కేసులో అరెస్టయ్యాడు. గతంలో కూడా తెలుగుదేశం పై అడ్డగోలు ఆరోపణలు చేసి ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఈ దంపతులు వివేకా హత్య పై నోరెత్తరేం?అంటూ ట్వీట్ చేశారు. శ్యామల తన భర్త నరసింహారెడ్డి ఉద్దేశించి చేసిన ట్వీట్ లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.