Daggubati : బాలయ్య గుట్టు విప్పిన దగ్గుబాటి.. అదేంటో తెలుసా.?

Daggubati : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ‘వెన్నుపోటు’ గురించి మాట్లాడుతూ, తనకు ఆ ఆరోపణ వింటోంటే కన్నీరు వస్తుందని చెప్పడం చాలామందికి విస్మయాన్ని కలిగించింది. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్వాయానా తన అల్లుడు నారా చంద్రబాబునాయుడు చేతిలో రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు.

నిజానికి, వెన్నుపోటు ఎపిసోడ్‌లో పైకి కనిపించేది చంద్రబాబే అయినా, తెరవెనుకాల పెద్ద కథే వుంది. చాలామంది ఆనాటి ఆ వెన్నుపోటు వ్యవహారంలో కీలక భూమిక పోషించారు. నారా చంద్రబాబునాయుడు పైకి కనిపించే ఓ ముఖ్యమైన పాత్రధారి మాత్రమే. ఎన్టీయార్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి. అంతేనా, ఆనాటి ఆ వ్యవహారంలో హరికృష్ణ, బాలకృష్ణ కూడా తమ తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించినట్లు దగ్గుబాటి చెప్పుకొచ్చారు.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొత్తగా వెల్లడించిన వాస్తవాలు కావివి. ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆనాటి ఆ ఘటన పట్ల చింతిస్తున్నానంటూ మొన్నామధ్య ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ మనసులోని బాధని బయటపెట్టారు.

ముఖ్యమంత్రి పదవి చంద్రబాబుకి, పార్టీ పగ్గాలు బాలకృష్ణ లేదా హరికృష్ణలలో ఎవరో ఒకరికి, డిప్యూటీ సీఎం పదవి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి.. ఇలా పంపకాలు జరిగాయి. ఆ పంపకాల్లో తేడాలు రావడంతో, చెరోదారి అయిపోయారు. కానీ, పక్కా వ్యూహంతో ఎన్టీయార్‌కి అంతా కలిసి వెన్నుపోటు పొడిచేశారు రాజకీయంగా.

వెన్నుపోటు వ్యవహారం గురించి బాలయ్య మాట్లాడకపోవడమే మంచిది. మాట్లాడితే, ఇదిగో ఇలాగే వాస్తవాలు బయటపడిపోతాయ్.. బాలయ్య పరువే పోతుంది.