Water Tank: వాటర్ ట్యాంక్ లో కోటి.. విషయం తెలిసి కంగుతిన్న అధికారులు..!

Water Tank: సాధారణంగా బడా వ్యాపారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు దొరకకుండా డబ్బును వివిధ మార్గాలలో తరలిస్తూ భద్ర పరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లోని ఓవ్యాపారి ఆదాయపన్ను శాఖ అధికారులకు దొరకకుండా ఏకంగా కోటి రూపాయల నగదును ఎవరూ ఊహించని విధంగా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ లో దాచిపెట్టారు.

దామోహ్‌లో మద్యం వ్యాపారి శంకర్‌ రాయ్‌, అతడి సోదరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు.ఈ క్రమంలోనే అధికారులు వీరి ఇల్లు మొత్తం సోదాలు నిర్వహించగా ఊహించని విధంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కోటి రూపాయల నగదు దొరకడంతో అధికారులు ఖంగుతిన్నారు.అయితే ఆ కోటి రూపాయలు అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ లో లభించడం అధికారులకు ఆశ్చర్యానికి గురి చేసింది.

సదరు వ్యాపారి బ్యాగులు ఆ డబ్బులను నింపి వాటర్ ట్యాంక్ లో పడి వేశారు.ఈ క్రమంలోని ఆ డబ్బును వాటర్ ట్యాంక్ లో గుర్తించిన అధికారులు వాటిని బయటకు తీసి హెయిర్ డ్రయ్యర్ డబ్బులను ఆరబెట్టారు. ఈ సోదాలలో భాగంగా ఐటీ అధికారులు ఎనిమిది కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా మరో ఐదు కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.