ప‌ర్వ‌దినాన ఆదిపురుష్ నుండి క్రేజీ అప్‌డేట్ రానుందా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గ‌త ఏడాది మొద‌లు పెట్టిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పూర్వ‌జ‌న్మ‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి వ‌స్తున్న అప్‌డేట్స్ అభిమానుల అంచ‌నాలను రెట్టింపు చేస్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ఆదిపురుష్ అనే చిత్రాల‌తో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాలు ఎప్పుడు విడుద‌ల అవుతాయి, ఆ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ ఏంట‌నే వాటిపై మేక‌ర్స్ దృష్టి పెట్టారు.

ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌లార్ చిత్రం బొగ్గు గ‌నుల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుండ‌గా, అక్టోబ‌ర్ లోప‌ల చిత్రాన్ని పూర్తి చేసి ఆ వెంట‌నే థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఇక ఆదిపురుష్ విష‌యానికి వ‌స్తే ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా .3డీ వ‌ర్షెన్‌లో తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కాగా, ఇంత వ‌ర‌కు మూవీ నుండి ఎలాంటి అప్‌డేట్స్ లేవు.ఇందులో ప్ర‌భాస్ రాముడి పాత్ర పోషించ‌నుండ‌గా, ఆయ‌న త‌ల్లి కౌసల్య పాత్ర‌లో హేమమాలి‌ని క‌నిపించ‌నుంద‌ని టాక్ నడుస్తోంది. మరోవైపు దశరథుడి పాత్రలో కృష్ణంరాజు ,ల‌క్ష్మ‌ణుడిగా టైగ‌ర్ ష్రాఫ్ న‌టించ‌నున్నార‌ని అంటున్నారు.

ఆదిపురుష్ చిత్రం కోసం దాదాపు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న‌ ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో రూపొందిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ లొకేష‌న్‌లో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తుండగా, ఏప్రిల్ 21 న శ్రీరామ నవమి కాబ‌ట్టి ఆ రోజు మూవీ నుండి సాలిడ్ అప్‌డేట్ ఒక‌టి రానుంద‌ని స‌మాచారం. చూడాలి మ‌రి మేక‌ర్స్ ఆ రోజు ఏదైన స‌ర్‌ప్రైజ్ ఇస్తారా లేదా అని.