Jaya Bacchan: జయా బచ్చన్ కు కోవిడ్ పాజిటివ్.. ఆందోళనలో బిగ్ బీ కుటుంబం..!

Jaya Bacchan: ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త అయిన ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తోంది. ధనిక, పేద అని తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతోంది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మందికి కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ లో ఇప్పటికే థర్డ్ వేవ్ లో మహేష్ బాబు, మంచు లక్ష్మి, వంటి ప్రముఖులు ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకున్నారు.తాజాగా బాలీవుడ్ లో అమితాబచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపుతోంది. ఇదివరకే అమితాబచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్య, ఐశ్వర్యరాయ్ అందరూ కరోనా బారిన పడ్డారు. అదృష్టవశాత్తు అందరూ క్షేమంగా కరోనా నుండి కోలుకున్నారు.

అయితే అప్పుడు చేయవచ్చును కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆమె కరోనా బారినుండి తప్పించుకోలేక పోయింది. ఇటీవల జయా బచ్చన్ కి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జయాబచ్చన్ ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గతంలో అమితాబచ్చన్ కరోనా బారిన పడ్డప్పుడు ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. అందువల్ల ఆయన 23 రోజులు హాస్పిటల్ లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవలసి వచ్చింది. కానీ జయ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి సానుకూలంగా ఉండటంతో హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.

జయాబచ్చన్ ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో వస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రంలో నటిస్తున్నారు. జయ బచ్చన్ కి కరోనా సోకడంతో సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించగా, ఆలియా భట్ హీరోయిన్.ప్రీతిజింటా, ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా ఆజ్మీ వంటి అగ్ర తారలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా షబానా ఆజ్మీ కూడా ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఇద్దరికీ కరోనా సోకడంతో న్యూ ఢిల్లీలో ఫిబ్రవరి 2 నుంచి 14 వరకూ ప్లాన్ చేసిన షెడ్యూల్ నిలిచిపోయింది.