కరణ్ బర్త్ డే పార్టీతో విజృంభించిన కరోనా.. కరోనా బారిన పడ్డ బాలీవుడ్ ప్రముఖులు!

కరోనా మహమ్మారి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలపై తన విశ్వరూపం చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ వివిధ దశలను మార్చుకుంటూ ప్రపంచ దేశాలన్నింటిని అతలాకుతలం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది ఆర్థికంగా ఎంతో నష్టపోయారు.ఇక మన దేశంలో కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో ప్రాణనష్టం కలిగించింది. అయితే ప్రస్తుతం కరోనా పూర్తిగా అంతమయిందని అందరూ భావిస్తున్న సమయంలో మరోసారి తన విశ్వరూపం చూపిస్తుంది.

ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 50 మందికి పైగా కరోనా బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. కొందరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఉన్నఫలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ సెలబ్రిటీలు మాత్రమే కరోనా బారిన పడటానికి కారణం ఏంటి అని ఆరా తీయగా అందుకు కారణం ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పుట్టినరోజు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ అరేంజ్ చేశారు. మే 25వ తేదీ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకల కోసం బాలీవుడ్ సినీ తార లోకం దిగి వచ్చింది.

బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సౌత్ ఇండస్ట్రీ నుంచి తమన్నా, రష్మిక, చార్మి ,పూరి జగన్నాథ్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇలా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేసిన సెలబ్రిటీలు ఈ పార్టీ అనంతరం ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతూ వస్తున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఇలా కరోనా బారిన పడటంతో నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ పెద్ద ఎత్తున నిర్మాత కరణ్ జోహార్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటి కరణ్ ఇది అందరిని పార్టీకి పిలిచావా లేదా కరోనా అంటించడానికి అందరినీ పిలిచావా అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇలా ఉన్నఫలంగా బాలీవుడ్ సెలబ్రిటీలు మొత్తం ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో అందరిలో ఆందోళన మొదలైంది.