ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్‌

ప్రముఖ దర్శకుడు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్‌ జారీచేస్తూ చెన్నై జార్జిటౌన్‌ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు తీవ్రంగా స్పందించింది. 2016లో సెల్వమణి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు ఓ ఇంటర్వ్యూలో ఫైనాన్షియర్‌ ముకుంద్‌చంద్‌ బోద్రా గురించి పలు అభిప్రాయాలు వెల్లడించారు. దీంతో బోద్రా వారిద్దరిపై జార్జిటౌన్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ విచారణకు సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేశారు.