Lalu prasad yadav: లాలూ ప్రసాద్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు..

Lalu prasad yadav: రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ గతంలో కుంభకోణం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. 1990లో లాలూ సీఎం గా ఉన్న సమయంలో బీహార్ లో దాణా కుంభకోణం కేసు బయటపడింది. ఈ నేపథ్యంలో ఆయనకు సీబీఐ కోర్టు ఐదేళ్ల శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా విధించింది.

అలా ఆయన 42 నెలలు జైల్లో గడిపాడు. దీంతో ఆయన జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండటంతో.. ఆయనకు తాజాగా బెయిల్ దొరికింది. మొత్తానికి ఆయన బెయిల్ తో బయటకు రాగా ఆయన కుటుంబ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు.