Corona Virus: దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా… ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..!

Corona Virus: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విలయ తాడవం చేస్తోంది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు క్ర‌మంగా పెరుగుతోంది. నిన్న‌టితో పోలిస్తే కేసుల్లో ఈ రోజు 21 శాతం పెరుగుద‌ల న‌మోదైంది. అటు ఒమిక్రాన్ సైతం పంజా విసురుతోంది. ఆదివారం ఉద‌యానికి 1525 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

దేశ వ్యాప్తంగా నిన్న 10,82,376 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 27,553 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,89,132కి చేరింది. నిన్న ఒక్క రోజే 284 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,81,770కి చేరింది. నిన్న 9,249 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,84,561కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,22,801 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.27 శాతంగా ఉంది.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా దేశంలో శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1525కి చేరింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 460 కేసులు నమోదు కాగా.. ఆ త‌రువాత ఢిల్లీలో 351 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక గుజ‌రాత్‌(136), త‌మిళ‌నాడు(117), కేర‌ళ‌(109), తెలంగాణ(67), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(17) కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 560 మంది కోలుకున్నారు.

దేశంలో 2021 జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న మందికి 25,75,225 మందికి టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,45,44,13,005 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 68.00 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.