కరోనా అప్డేట్: ఏపీలో కొత్తగా 1,859 కేసులు… 13 మరణాలు

Corona update in Andhra pradesh

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి శాంతించినట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 70,757 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,859 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,586,015 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 4, కృష్ణ 3, ప్రకాశం 2, తూర్పుగోదావరి 2, నెల్లూరు 1, విశాఖ పట్నం ఒక్కరు చొప్పున ​మొత్తం 13 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,595 కి చేరింది.

Corona update in Andhra pradesh

కరోనాబారి నుంచి నిన్న 1,575 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,49,841 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 18,688 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,54,53,520 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపురం -40, చిత్తూరు-233, తూర్పుగోదావరి-402, గుంటూరు-182, కడప-148, కృష్ణ-144, కర్నూలు-19, నెల్లూరు-225, ప్రకాశం-96, శ్రీకాకుళం-28, విశాఖపట్నం-123, విజయనగరం-24, పశ్చిమ గోదావరిలలో-195 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.