Corona update in AP: ఏపీలో రోజు రోజుకి పెరిగిపోతున్న కరోనా… కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే?

Corona update in Andhra pradesh

Corona update in AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,849 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 840 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 20,76,868 కి చేరింది. కరోనా కారణంగా నిన్న విశాఖ పట్నంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 14,501 కి చేరింది.

కరోనాబారి నుంచి నిన్న 133 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 20,59,395 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 2,972 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 3,15,29,919 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపురం -33, చిత్తూరు-150, తూర్పుగోదావరి-70, గుంటూరు-66, కడప-24, కృష్ణ-88, కర్నూలు-23, నెల్లూరు-69, ప్రకాశం-22, శ్రీకాకుళం-25, విశాఖపట్నం-183, విజయనగరం-49, పశ్చిమ గోదావరిలలో-38 చొప్పున కేసులు నమోదయ్యాయి.