Varalakshmi: కరోనా బారిన పడ్డ క్రాక్ ముద్దుగుమ్మ.. ఆస్పత్రిలో చికిత్స..!

Varalakshmi: కరోనా మహమ్మారి రోజురోజుకు తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర భయాందోళనలు వెంటాడుతున్నాయి.ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు సాధారణ వ్యక్తులు ఈ మహమ్మారి బారిన పడి తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వ్యాధి నుంచి బయట పడుతున్నారు.ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి మనకు తెలిసిందే.

తాజాగా మహేష్ బాబు, మంచు లక్ష్మీ ప్రసన్న ఈ మహమ్మారి బారిన పడినట్లు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఇదిలా ఉండగా ట్రాక్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ (జయమ్మ) కరోనా మహమ్మారి బారిన పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరోనా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తర్వాత చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారని చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేశారు. అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలో ఈమె కీలక పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా కోసమే హైదరాబాద్ వచ్చి కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.