ఏపీలో కరోనా తగ్గుముఖం… కొత్తగా 1,461 పాజిటివ్‌ కేసులు

Corona cases are declining in AP

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి శాంతించినట్లుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 63,849 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,461 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,82,287 కి చేరింది. కరోనా కారణంగా చిత్తూరు 6, కృష్ణ 3, నెల్లూరు 3,తూర్పుగోదావరి 2, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున ​మొత్తం 15 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,564 కి చేరింది.

Corona cases are declining in AP

కరోనాబారి నుంచి నిన్న 2,113 మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,49,841 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 18,882 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,53,11,733 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే… అనంతపూర్-23, చిత్తూరు-195, ఈస్ట్ గోదావరి-98, గుంటూరు- 182, కడప- 59, కృష్ణ- 210, కర్నూల్- 12, నెల్లూరు-195, ప్రకాశం- 112, శ్రీకాకుళం- 41, విశాఖపట్నం- 74, విజయనగరం- 20, వెస్ట్ గోదావరి-235 చొప్పున కేసులు నమోదయ్యాయి.

గమనిక: కరోనాను కట్టడికి ప్రస్తుతం వాక్సిన్ ఒక్కటే పరిష్కార మార్గం. భౌతిక దూరం పాటించండి, మాస్క్ ధరించండి, చేతులను శుభ్రంగా శానిటైజ్ చేసుకోండి.