కాంగ్రెస్ వస్తుంది కాబట్టి.. మేము వెళ్ళము: అసదుద్దీన్ ఓవైసీ

తాజాగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. మమతా బెనర్జీ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కానని అన్నారు. ఇక ఆ సమావేశానికి తనకు ఆహ్వానం రాలేదు అని.. ఒకవేళ ఆహ్వానం వచ్చినా కూడా తాను హాజరు అయ్యే వాడిని కాదు అని అన్నారు. ఎందుకంటే అక్కడికి కాంగ్రెస్ ను ఆహ్వానించారు అని.. అందుకే తాము అక్కడికి వెళ్లమని అన్నారు.

ఇక మమత పార్టీ టీఎంసీ తమ పార్టీ గురించి దారుణంగా మాట్లాడింది అని.. అలాంటప్పుడు ఆ సమావేశానికి ఎలా హాజరు అవుతాను అని ప్రశ్నించారు. ఇక 19 రాజకీయ పార్టీల నేతలను మమతా తమ సమావేశానికి ఆహ్వానించారు అని.. అంతేకాకుండా ఈ సమావేశానికి జగన్ ను ఆహ్వానించలేదని అన్నారు.