విరాట పర్వం సినిమాను బ్యాన్ చేయాలి అంటూ ఫిర్యాదు..

ఇటీవలే రానా, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన విరాట పర్వం థియేటర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాకు అనుమతి ఇచ్చిన సెన్సార్ బోర్డు అధికారిపై శ్వహిందూ పరిషత్ విద్యానగర్ జిల్లా కార్యదర్శి అజయ్ రాజ్ సుల్తాన్ బజార్ పోలీస్ లకు ఫిర్యాదు చేశారు.

ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఉందని.. పోలీసులను కించపరిచే విధంగా ఉందని అంతేకాకుండా అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయి అని కాబట్టి సినిమాను బ్యాన్ చేయాలి అని ఫిర్యాదు చేశారు. నిషేధిత సంస్థలైన నక్సలిజం, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా అనుమతి ఇస్తుంది అని ప్రశ్నించారు.