Revanth Reddy: తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు కావడంతో వజ్రోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే.. ఇలా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేసిఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు నిర్వహించిన అనుభవం జానారెడ్డి, కేకేకు ఉందని ఇప్పుడు కూడా ఇదే అంశం గురించి అదే విధంగా వ్యవహరించేందుకు అధిష్టానం నిర్ణయాన్ని ఎదురుచూస్తున్నామని వెల్లడించారు. పార్టీ హైకమాండ్ కు సమాచారం ఇచ్చి, పీస్ కమిటీ రిక్వెస్ట్ పంపిస్తామని తెలిపారు.
తాను ముఖ్యమంత్రి అయిన రోజే కేసీఆర్ గుండె పగిలిందని తెలిపారు. కేసీఆర్ స్పీచ్ లో ఎంతో అక్కసు వెళ్ళగక్కారని రేవంత్ రెడ్డి తెలిపారు తాము కెసిఆర్ సభకు బస్సులు అన్నింటిని ఎలాంటి ఆంక్షలు లేకుండా పంపించాము కానీ గతంలో కేసీఆర్ మాత్రం రాహుల్ గాంధీ పర్యటనకు కనీస బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేకపోయారని తెలిపారు. గత పది సంవత్సరాలుగా కేసీఆర్ రాష్ట్రాన్ని మొత్తం లూటి చేశారని,ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్ధాలకు కేసీఆర్ బాధ్యత వహించాలని, రేవంత్ రెడ్డి కెసిఆర్ తీరుపై విమర్శలు కురిపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి రేవంత్ మాట్లాడుతూ.. చట్టం మేరకే చర్యలు తీసుకుంటామని, కేసీఆర్ లాగా నేను చట్టాన్ని అతిక్రమించను అని ఆయన అన్నారు. కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా చట్ట ప్రకారమే సాగిస్తామని స్పష్టం చేశారు. ఇలా కేసీఆర్ కు కౌంటర్ గా రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.