కాళేశ్వ‌రం ముక్తేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో సీఎం కేసీఆర్ పూజ‌లు

cm kcr tension on warangal and khammam districts

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సతీసమేతంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిశీలన కోసం కాళేశ్వరం చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం ఉదయం బయల్దేరారు. కాళేశ్వరం చేరుకుని నేరుగా కాళేశ్వర , ముక్తేశ్వర స్వామివార్ల దర్శనానికి వెళ్లారు. సీఎం కేసీఆర్, శోభ దంపతులు, మంత్రులకు వేద పండితులు ఘన స్వాగతం పలికి ఆలయం లోపలకు తీసుకెళ్లారు.

CM KCR visits Kaleshwaram and Barrage also - Sakshi

అంత‌కుముందు వారికి అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగతం ప‌లికారు. కాగా, కాసేప‌ట్లో కేసీఆర్ హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ‌ద్ద‌కు వెళ్లి రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. యాసంగి సీజన్‌లో కాళేశ్వరం ద్వారా.. నీటిని పంపించే విధానాన్ని పరిశీలించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ పర్యటన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని ప్రధాన బ్యారేజ్‌లు పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగి సీజన్‌లో పంటలకు జలాలను పంపింగ్‌చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కాళేశ్వరంలో పర్యటిస్తున్నారు.

అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. లక్ష్మీ బరాజ్‌ చేరుకొని.. అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. యాసంగి పంటలకు సరిపడా సాగునీటిని అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తారు.మ‌ధ్యాహ్నం లక్ష్మీ బరాజ్ వ‌ద్దే కేసీఆర్ భోజ‌నం చేస్తారు. అనంత‌రం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. కేసీఆర్‌ పర్యటన సందర్భంగా పోలీసులు కాళేశ్వ‌రం వ‌ద్ద‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.