బాలకృష్ణ డైలాగ్ తో రెచ్చిపోయిన చిత్ర..మనో ఎక్స్ప్రెషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బుల్లితెర మీద ఎన్నో రకాల రియాలిటీ షోలో ప్రసారం అవుతూనే ఉన్నాయి. అటువంటి షో లలో సింగింగ్ షో లు కూడ మంచి గుర్తింపు పొందాయి. గత 25 సంవత్సరాల నుండి ఈటీవీలో ప్రసారమవుతున్న పాడుతా తీయగా షో ద్వారా ఎంతోమంది సింగర్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సింగిల్ 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా జీ తెలుగులో కూడా సరిగమప సింగింగ్ షో ఎంతోమంది యువత తమ టాలెంట్ నిరూపించుకోవటానికి వేదికగా నిలిచింది.

ఈ క్రమంలో ప్రస్తుతం చిన్నారుల్లో ని సింగింగ్ టాలెంట్ ని బయటకు తీసే క్రమంలో ” సూపర్ సింగర్స్ జూనియర్స్” ఈనెల 22వ తేదీన ప్రారంభం కానుంది. ఈ సింగింగ్ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ షోకి అనసూయ సుధీర్ యాంకర్లుగా వ్యవహరించనున్నారు. ఈ షో లో చిత్ర, మనో, రణీనా రెడ్డి, హేమచంద్రజడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోలో 14 మంది చిన్నారులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన ప్రోమోలో చిన్నారులు సుధీర్ మీద పంచులు వేశారు. ఒక బాలుడు ” పాలకూర పప్పు సుధీర్ అన్న నిప్పు” చెప్పటంతో సుధీర్ ఒక్కసారిగా షాక్ అయ్యి వీళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం అని అన్నాడు.

ఇక జడ్జ్స్ కూడ గ్రాండ్ గా స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ప్రోమోలో సింగర్ చిత్ర గారు ఫ్లుటూ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అని డైలాగ్ చెప్పటంతో మనో ఫన్నీగా రీయాక్ట్ అయ్యారు.ఇటీవల విడుదలైన ఈ ప్రోమో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఈ షో ద్వార చిన్నారులు తమ సింగింగ్ టాలెంట్ ని నిరూపించుకోబోతున్నారు.