కాజల్ వల్ల  ‘ఆచార్య’  షూటింగ్ కు అంతరాయం కలగనుందా?

Acharya Movie Motion Poster

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ షూటింగ్ మొదలైపోయింది. దర్శకుడు కొరటాల శివ, చిరు మినహా మిగతా కీలక నటీనటులతో చిత్రీకరణ చేస్తున్నారు. త్వరలోనే మెగాస్టార్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాలో  కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Kajal Agarwal 

ఈ ముద్దుగుమ్మ కూడా  డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణలో పాల్గొనాలి. అయితే అందుకు కొంత సమయం కావాలని, అప్పుడే  షూటింగ్ లో పాల్గొనలేనని కాజల్ చెబుతుందట. దాంతో ‘ఆచార్య’  షూటింగ్ కు కొంత అంతరాయం ఏర్పడనుందని చెబుతున్నారు దర్శక నిర్మాతలు.

రామ్ చరణ్ ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర చేస్తుండటంతో ఈ  ‘ఆచార్య’ పై  అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగాయి. కొరటాల తన ఎవరు గ్రీన్ ఫార్ములా అయినా కమర్షియాలిటీ, సోషల్ మెసేజ్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే మొదటి నుండి సినిమాలో  విలన్ కోసం బాలీవుడ్ నటుడ్ని తీసుకొస్తారని చాలాసార్లు  చెప్పుకున్నారు. చిరును ఢీ కొట్టబోయే ఆ విలన్ ఎవరనే విషయమై సోషల్ మీడియాలో  పెద్ద చర్చ నడిచింది. ఇప్పుడు మాత్రం దక్షిణాది నటుడినే తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నటుడు మరెవరో కాదు తమిళ స్టార్ అరవింద్ స్వామి.

కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోని రీఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి నెగెటివ్ పాత్రలు కూడా చేస్తున్నారు. ఆయన ప్రతినాయకుడిగా చేసిన ‘ధృవ, తని ఒరువన్, నవాబ్’ చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. అందుకే ఆయనైతేనే మెగాస్టార్ చిరంజీవి ఫవర్ కు కరెక్టుగా ఉంటారని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు.