Chiranjeevi : బిగ్ న్యూస్ : వక్ర బుద్ధి మీడియాకి చిరంజీవి దిమ్మతిరిగే సమాధానం.!

Chiranjeevi : ఎలాంటి అంశాన్ని అయినా కూడా ప్రజల మనసులోకి ఎక్కించడంలో మీడియా పాత్ర ఎంతగానో ఉంటుంది. అందులోని మన తెలుగు మీడియా పాత్ర అమోఘం ఎంత చెప్పినా తక్కువే.. కొన్ని ఛానెల్స్ పాటించే విలువలు గాని ప్రజలకు చేరవేసే న్యూస్ కానీ న భూతో న భవిష్యత్ అన్నట్టు ఉంటాయి.

మరి అలా మన తెలుగు మీడియా వల్ల ఎంతో లాభం పొందిన టాలీవుడ్ హీరోల్లో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఆ లాభం ఏంటో ఎంతో కూడా తెలుగు ప్రేక్షకులకి తెలుసు. అయితే రీసెంట్ గా చిరు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలవడానికి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ భేటీ లో తాము కేవలం సినిమా కోసం మాత్రమే చర్చించుకున్నాం అని మీడియా ముఖంగానే తెలిపారు. అయినా అత్యుత్సాహపు మీడియా మాత్రం దానిని వక్రీకరించి మరో రకంగా చిత్రీకరించారు. మరి దీనికి గాను చిరు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.

“తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం.

రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు.దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను. న్యూస్ ఇవ్వండి, వ్యూస్ కాదు” అని చివరలో కౌంటర్ ట్యాగ్ కూడా వేశారు. దీనితో అభిమానులు సహా పలువురు సినీ ప్రముఖులు కూడా చిరు కి మద్దతుగా నిలిచారు.