Chiru 154: సుమంత్ దెబ్బకు మారిపోయిన చిరు సినిమా టైటిల్…కారణం ఏమిటంటే!

Chiru 154: స్టార్‌ హీరోలంతా ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. ఆ లెక్కన చూసుకుంటే బాలకృష్ణ, మహేశ్ బాబు, చిరంజీవి, ప్రభాస్ ఇలా తమ నటనతో మరోసారి వినోదాన్ని పంచేందుకు, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధం అవుతున్నారు. మామూలుగా అయితే ఏ హీరో అయినా ఒక సినిమా షూటింగ్ అయిపోయాక, మరో సినిమా వైపు వెళ్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తూ నిజంగానే మెగాస్టార్ అనిపించుకుంటున్నారు చిరంజీవి.

అయితే ఆయన ఇటీవల నటించిన ఆచార్య సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల ఆగిపోయినా, త్వరలో థియేటర్లో వినోదాల పంటను పండించేందుకు సిద్ధమైంది. తన 153వ సినిమాగా రాబోతున్న లూసీఫర్ రిమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్‌లో చిరంజీవి ఇప్పటికే పాల్గొంటున్నారు. ఇక ఆయన తదుపరి చిత్రం డైరెక్టర్ బాబీ కలయికలో రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఇప్పటికే మాస్ గెటప్‌ని రివీల్ చేశారు మేకర్స్. అయితే టైటిల్ కూడా అప్పుడే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ, టైటిల్‌పై క్లారిటీ రాకపోవడంతో వాయిదా వేశారు. మొదటగా ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అని అనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆ పేరును మారుస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ముఖ్య కారణం హీరో సుమంత్ కొత్త మూవీ వాల్తేరు శీను అని పెట్టడమే అని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

కాగా ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య కాకుండా వాల్తేరు మొనగాడు అని పెడితే బాగుంటుందని డైరెక్టర్ బాబీ అనుకోవడం, అది చిరంజీవికి కూడా నచ్చడంతో ఆ పేరే ఫైనల్ చేయాలని అనుకున్నారట. కానీ తన ఇమేజ్‌కు తగ్గట్టుగా మరేదైనా టైటిల్ పెడితే బాగుంటుందేమోనని చిరంజీవి అనడంతో ఈ టైటిల్ కూడా ఫైనల్ అవుతుందని నమ్మకం లేకపోయింది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా చిత్రీకరణలో ఉన్న మెగాస్టార్, అది అయిపోయాక బాబీ సినిమాలో బిజీ అవుతారని సమాచారం.