Chiranjeevi: చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి… అందరికీ స్ఫూర్తి అంటూ!

Chiranjeevi: తెలుగుదేశం పార్టీ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్‌ సెట్‌ షిప్ట్‌ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అదే విధంగా పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో చంద్రబాబు గురించి చిరు చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. జీవితం ఏమవుతుందో అనే అభద్రతాభావంతో ఉండే కంటే నేను సాధించగలనని మైండ్‌ సెట్ తో ముందుకెళ్లాలని. తాను అక్కడే విజయం సాధించానని తెలియజేశారు. మనం కష్టపడి ఉన్నత స్థానానికి వెళ్లిన మన ప్రవర్తన సరిగా లేకపోతే మన విజయానికి గుర్తింపు ఉండదని చిరంజీవి తెలిపారు.

ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడుతూ రాజకీయాలలో రాణించి మంచి సక్సెస్ అవ్వాలన్నదే తన లక్ష్యం అని అందుకు ఎన్నో ఇబ్బందులు వడదుడుకులను ఎదుర్కొని చంద్రబాబు నాయుడు కూడా రాజకీయాలలో సక్సెస్ అందుకున్నారని తెలిపారు.చంద్రబాబు మానసిక స్థైర్యంతో ఉన్నారని.. అంతటి ధీరోదాత్తత ఆయనలో తాను చూశానని వివరించారు. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిని అధిగమించేలా మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో ముందుకు వెళ్లాలని భావించే వ్యక్తి చంద్రబాబు గారిని ఆయన ఎందరికో స్ఫూర్తి అని తెలిపారు.

కాలేజీ రోజుల నుంచి నాయకత్వ లక్షణాలతో ఎదిగారన్నారు. రాష్ట్రానికి సేవ చేయాలనే దీక్షతో నడిచిన చంద్రబాబు… వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఎదిగారని చిరంజీవి తెలిపారు ఆయన నాయకత్వంలోనే తెలంగాణలో ఐటి అభివృద్ధి చెందిందని చిరు గుర్తు చేశారు.చంద్రబాబు ధీరోదాత్తుడని అలిపిరి దాడి ఘటనలో పడిలేచిన ఆయనలో ఎంతో మానసిక స్థైర్యం చూశానని చంద్రబాబుపై చిరు ప్రశంసల వర్షం కురిపించారు.