Chiranjeevi : ఘట్టమనేని ఫ్యామిలీలో మరో విషాదం.. తీవ్ర భావోద్వేగం వ్యక్తం చేసిన చిరంజీవి.!

Chiranjeevi : గత కొన్ని కొన్ని రోజులు కితమే ఘట్టమనేని కుటుంబపు టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా కి మొట్ట మొదటి సారిగా గురి కావడం తీవ్ర విషాదానికి లోను చేసింది. అయితే ఇదిలా ఉండగానే దీనికి మించిన విషాదం ఇప్పుడు మరొకటి వారి కుటుంబంలో చోటు చేసుకోవడం షాకిచ్చింది.

మహేష్ బాబు తండి సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు అయినటువంటి ఘట్టమనేని రమేష్ బాబు గత కొన్నాళ్ల నుంచి కాలేయానికి సంబంధించి బాధపడుతున్నారట. కానీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఫలితం మందగించే సరికి నిన్న హాస్పిటల్ కి తీసుకువెళ్తుండగానే ఆయన తుది శ్వాస విడిచారు.

దీనితో వారి కుటుంబంలో ఊహించని తీరని విషాదం నెలకొంది. అయితే ఈ వార్త తెలిసిన తర్వాత టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి అత్యంత భావోద్వేగానికి లోనైనట్టు తెలిపారు.

ఈ ఊహించని వార్త విని ఎంతో షాక్ అయ్యి బాధ పడ్డానని, మహేష్ బాబు మరియు కృష్ణ గురై కుటుంబం అందరి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. ఆ పరమేశ్వరుడు మీకు ఈ బాధని తట్టుకునే విధంగా తగిన శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపి చిరు తన భావోద్వేగ స్పందనను తెలియజేసారు.